Skip to main content

దేనికి విలువ ఇస్తే......అదే దొరుకుతుంది!✍

ఒకరాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే    చాలాప్రీతి...
కలవాడు. ప్రజలంటే చాలావాత్సల్యము కలవాడు.    ధర్మ స్వభావం  కలవాడు!

అతడు నిత్యం భగవంతుడిని ఎంతో ప్రార్థించేవాడు.         రోజూ చాలా శ్రద్ధగా భగవంతుని  పూజ స్మరణం  చేసుకునే వాడు.

ఒకరోజు  భగవంతుడు    ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు- “రాజా,   నేను  చాలా  సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.”

అప్పుడు ప్రజలంటే ఎంతోప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు-  “భగవన్, నా దగ్గర  నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల   నా రాజ్యంలో అన్ని   సుఖ సంతోషాలు ఉన్నాయి.    అయినప్పటికీ నాకు ఒకటే కోరిక!     ఏంటంటే-   మీరు నాకు కనిపించినట్టే,     నన్ను   ధన్యుణ్ణి చేసినట్టే,     నా  ప్రజలందరినీ    కూడా కృపతో ధన్యులను చేయండి. వారికీ... దర్శనాన్ని ఇవ్వు.”

భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా.....”    అని    ఏదో చెప్పబోయాడు. కాని రాజుమాత్రం చాలా పట్టు బట్టి “ఈ కోరికను తీర్చవలసిందే”  అన్నాడు.

భగవంతుడు చివరకు భక్తుడికి .... లొంగక తప్పలేదు.   ఆయన అన్నాడు- “సరే,  రేపు నీ ప్రజలందరిని  తీసుకుని ఆ కొండ దగ్గరకు రా!    నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.”

అప్పుడు రాజు అది విని  చాలా.... ప్రసన్నుడై,  భగవంతుడికి ఎంతో  ధన్య వాదాలు  చెప్పుకుని,   మరుసటిరోజు ... నగరంలో దండోరా వేయించాడు-“రేపు
అందరూ కొండ దగ్గరకు  నాతో పాటు... వచ్చి చేరవలసింది, అక్కడ మీకందరికీ భగవంతుడు  దర్శనం ఇస్తాడు!”

రెండవరోజు రాజు  తన ప్రజలందరిని, స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు,    నడుస్తూ నడుస్తూ   దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది.    ప్రజలలో నుండి కొంతమంది   అటువైపు పరిగెత్తటం.... మొదలుపెట్టారు.

అప్పుడు జ్ఞాని అయిన  ఆ రాజు వారి అందరిని సమాధానపరచి,"అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు,  ఎందుకంటే... మీరు అందరూ  భగవంతుడిని    కలవ టానికి   వెళ్తున్నారు.     ఈ రాగి నాణాల వెనకాలపడి, మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి.” అన్నాడు.

కానీ లోభం ఆశవల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది  రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆనాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులోఇలా అనుకున్నారు 'మొదట   ఈ రాగి నాణాలను   ఇంటికి చేర్చుకుందాము. భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా' అని!

రాజు మాత్రం ముందుకు సాగాడు! కొంతదూరం పోయాక.... వెండినాణాల కొండ కనిపించింది.  మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణేలను  మూట కట్టుకుని ఇంటివేపు వెళ్ళిపోయారు.  వాళ్ళకు ఈ అవకాశం   మళ్ళీ మళ్ళీ దొరకదు   అని అనిపించింది.  ‘వెండి  నాణేలు  మళ్ళీ దొరుకుతాయో తెలియదు,భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు.’
అనిపించింది.

ఈ విధంగా   కొంత దూరం   వెళ్లిన తర్వాత     బంగారపు నాణేల  పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలినవారంతా,  రాజు బంధువులతో సహా అటువైపే...    పరు గెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళూ ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని   సంతోషంగా  తిరిగి వెళ్ళిపోయారు.

ఇంక కేవలం రాజు రాణి మిగిలారు. రాజు రాణి తో అన్నాడు-     “చూడు, ఈ ప్రజలు   ఎంత  ఆశపోతులో...!     భగ వంతుడు  లభించటం అంటే... ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు!  భగవంతుని ఎదుట మొత్తం ప్రపంచం లోని ధనమంతా కూడా  ఒకలెక్కకాదే!” నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది.    వారిద్దరూ ముందుకు సాగారు.

కొంతదూరం వెళ్లాక   రాణికి, రాజుకు ఏడురంగులలో  మెరుస్తూ  ....   వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది.ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి,  వజ్రాలన్నిటినీ మూట కట్టుకోవటం ప్రారంభించింది.

అదిచూసి రాజు ఎంతోబాధపడ్డాడు. మనసు విరక్తి చెంది,  చాలా బరువైన... మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు.    రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు- “ఎక్కడ ఉన్నారు   నీ ప్రజలు,  నీ యొక్క బంధువులు?     నేను ఎప్పటి నుంచో... ఇక్కడే నిలబడి మీఅందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.”

రాజు చాలా సిగ్గుతో,ఆత్మగ్లానితో తన తల దించుకున్నాడు.

అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు “ఓరాజా, ఎవరు తమ జీవితంలో....   భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని  వారు భావిస్తారో    వారికి    ఎప్పటికీ    నేను... లభించను!

వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు!”

సారం- ఏ ప్రాణులు తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని..... శరణు వేడుతారో,        ఎవరు     లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి   ఇష్టతతో పరమేశ్వరుని తన సొంతం          అను కుంటారో,     వారు అన్ని కర్మల   నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు!..✍

Comments

Popular posts from this blog

Rakhi

Dear friends, With the festival of Raksha Bandhan, I am reminded of some fond memories of celebrating rakhi when I was a young boy, probably around the age of five or six. The festival was a neighborhood affair, and all my sisters would come to me to tie their threads. By the end of the day, I would have rakhis tied on both my wrists, and even my ankles! For my friends from outside India, who may be unfamiliar with the festival, Raksha Bandhan celebrates the bond of love between brothers and sisters. The two words raksha and bandhan literally translate to “bond of protection.” The ceremony usually involves a sister tying a wristband, better known as a rakhi on her brother’s wrist. The rakhi is an expression of a sister’s will of protection towards her brother, in turn, also entrusting him with the responsibility of protecting her. Even today, Raksha Bandhan is a festival of great ritual significance. Yet, the question remains: what can we do to make this festival more meaningful...

నేను, నాది...

 ఒక రాజు ఓ  జ్ఞాని వద్దకు వెళ్లి... నేను ప్రశాంతంగా ఉండ లేక పోతున్నాను" అన్నాడు.. "నువ్వు నీ  బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా?" అడిగారు ఆ జ్ఞాని. "మా రాజ్యానికి శత్రు భయం లేదు. దొంగల భయం లేదు. మా రాజ్యంలో పన్నులు తక్కువే. న్యాయ వ్యవస్థ కూడా బాగుంది. ఎక్కడా ఎవరికీ  అన్యాయం జరగదు. ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు. కానీ నాకే ప్రశాంతత లేదు. నేను ఏం చెయ్యాలి" రాజు ప్రశ్నించాడు. "సరే నీ బాధ అర్ధమైంది. నేనొకటి చెప్తాను. అలా చెయ్యి. నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే" అన్నారు జ్ఞాని.  "అంత కన్నా ఇంకేం కావాలి... తీసుకోండి. ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని" చెప్పాడు రాజు. "సరే నా కిచ్చావు. నువ్వేం చేస్తావు?" జ్ఞాని అడిగారు. "నేను ఎక్కడి కైనా వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసు కుంటూ బతుకుతాను" అన్నాడు రాజు. "ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చెయ్య వలసిన పనులు చెయ్యి. ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు. చెయ్యగల సమర్దుడివి. ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను"  చెప్పారు జ్ఞాని.  ఒక సంవత్సరం గడిచిం...

Chetak

ఈ రోజు రాజస్థాన్ లోని మేవాడ్ ను పరిపాలించిన రాజు మహారాణా ప్రతాప్ జయంతి .మహారాణా ప్రతాప్ మేవార్ రాజపుత్ రాజుల్లో ప్రముఖులు . గొప్ప యుద్ధవీరులు. అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పెడితే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు. కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైన కోరికని తిరస్కరించాడు. మరిచిపోలేని హల్దిఘాట్ యుద్దం లో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో ఉంది. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు. ఇందులో 8000 మంది రాజ్పుతులు అయితే 40000 మంది మొఘలులు ఉన్నారు. మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడంటారు. శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది అది కూడా మహారణాతో పాటుగా. మహారణా ప్రతాప్ కి ఇష్టమైన ఆ గుర్రానికి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది. అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చే ముందు తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరా...